మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Widgets

మల్లాది సూర్యనారాయణ శాస్త్రి రచనలు Malladi Suryanarayana Shastri Rachanalu

మల్లాది సూర్యనారాయణ శాస్త్రి రచనలు Malladi Suryanarayana Shastri Rachanalu





ఈయన తల్లి వేంకమాంబ,తండ్రి శ్రీరామావధానులు.వీరి జన్మస్థలము చినకడియపులంక (దీనికి బుర్రిలంక-మల్లాదివారిలంక యని నామాంతరములు). వీరు ఫిబ్రవరి 20 1880 న అనగా ప్రమాది నామ సంవత్సర మాఘ శుద్ధ దశమి నాడు జన్మించారు. మహాపండితులు చర్ల బ్రహ్మయ్యశాస్త్రి వద్ద వ్యాకరణశాస్త్రాధ్యయనము చేశారు. స్వయంకృషితో ఉభయభాషావిశారదులై 1900లో అమలాపురము హైస్కూలులో ఉపాధ్యాయులుగా నాలుగు సంవత్సరాలు పనిచేశారు. తర్వాత ఆంధ్రసాహిత్యపరిషత్తు వ్యవహర్తగా నొకయేడు ఉద్యోగం నిర్వహించారు. 1915లో రాజమండ్రి ట్రైనింగుకాలేజిలో అధ్యాపకుడిగా పనిచేశారు. అటు తర్వాత అనంతపురము దత్తమండల కళాశాలలో  మూడేండ్లు అధ్యాపకుడిగా పనిచేశారు. మరల రాజమహేంద్రవరముఆర్ట్సు కాలేజిలో 1919 - 1931 నడుమ పండ్రెండు వత్సరములు తెలుగు పండితులుగా ఉద్యోగం చేశారు. అక్కడినుండి ఆంధ్ర విశ్వవిద్యాలయ కళాశాలలో పదియేండ్లపాటు పనిచేశారు. మొత్తముమీద నాలుగుదశాబ్దులు పఠనపాఠనములలో వీరు ఆరితేరారు. ఈలోపుననే వీరు కొన్ని గౌరవోద్యోగములు నిర్వహించిరి. వేంకటగిరి రాజావారి సంస్థాన కవితాపదవి 1909 - 1919 మధ్య, జటప్రోలు సంస్థానవిద్వత్ స్థానము 1910 - 1917 నడుమ నిర్వహించారు. నారయ్యప్పారావు సంస్థాన విద్వత్కవిత్వ పట్టము 1919 - 1926 నడుమ నడిపినారు. ఈవిధముగా సంస్థానకవులై,  ఉపాధ్యాయులై అంతేవాసులకెందఱకో విద్యాభిక్ష పెట్టారు.

గ్రంథములు[మార్చు]

  1. సంస్కృతవాజ్మయచరిత్ర (2 భాగములు). ఆంధ్రవిశ్వకళా పరిషత్ ప్రచురణములు.                                      1. వైదిక భాగము.                                                                                                                                  2. లౌకిక భాగము
  2. ఆంధ్రభాషానుశాసనము (2 భాగములు. చరిత్రాత్మకవ్యాకరణము)
  3. ఆంధ్రదశరూపకము (తెనుగుసేత)
  4. భాసనాటక కథలు (వచనము 2 భాగములు)
  5. ప్రేమ తత్త్వము (స్వతంత్ర పద్యకావ్యము)
  6. ఉత్తరరామచరిత్ర (ఆంధ్రీకృతి)
  7. భీష్మప్రతిజ్ఞ (స్వతంత్రనాటకము)
  8. ఆంధ్రభవిష్యపర్వము (పద్యప్రబంధము)
  9. భవభూతినాటక కథలు
  10. విదురనితి
  11. స్త్రీధర్మబోధిని
  12. సత్యకీర్తినాటిక
  13. కలివిడంబనము
  14. మహాభారత విమర్శనము
  15. సత్యకీర్తి
  16. విశ్రుతోర్వశీయము
  17. వ్యాసరత్నావళి
  18. సంస్కృత కవి జీవితము
  19. మాలతీ మాధవము

సంస్కృతరచనములు[మార్చు]

  1. బ్రహ్మసూత్రార్థదీపిక
  2. రజోనన్తర వివాహము
  3. సంస్కృతభాషా (ఇవి షష్టిపూర్తి సంపుటములో ముద్రితములు) అనేక పత్రికలలో వ్యాస రచనలు.
  4. పండితాభిప్రాయ మణిమాలిక

సాహితీ రంగంలో సేవలు

వీరు సంస్కృతాంధ్రములయందు గావలసినంత నికరమైన పాండిత్యము గలవారు. ఈ పాండిత్యమునకు దీటయినది వారికి గల యభినివేశము. సంస్కృతవాజ్మయ చరిత్ర, ఆంధ్రభాషానుశాసనము మున్నుగా వారు రచించిన కృతులు శాస్త్రిగారి పట్టుదలను బ్రదర్శించుటకు బట్టుగొమ్మలయినవి. ఆయనకు కవిగానున్న కీర్తికంటె, అధ్యాపకుడుగా విమర్శకుడుగానున్న పేరుపెంపులు పెద్దవి. వీరు అనువాదములేకాక స్వతంత్రరచనలు కూడ కావించిరి. వీరి కృతులన్నియు పాఠ్యములుగా నిర్ణయింపబడ్డాయి. 'సంస్కృత వాజ్మయచరిత్ర' వీరిది శాశ్వతముగా నుండ దగినగ్రంథము. ఒకదశాబ్దము చేసిన నిరంతరకృషి ఫలము. వైదికవాజ్మయము, లౌకికవాజ్మయము అని రెండుభాగములుగా ఈ గ్రంథము విభజింపబడి వ్రాయబడినది. ఆంగ్లములో ఇదివఱకు సంస్కృతవాజ్మయ చరిత్రమున కల పొరపాటులు పేర్కొని, మనోహరము నిర్గుష్టము అయిన ఫక్కిలో వీ రీ గ్రంథమును రచించిరి. వెంకటగిరి సంస్థానాధిపతుల ప్రోత్సాహముచే "సంస్కృత కవిజీవితములు" తెనుగులో రచించి వెలువరించిరి. ఈరెండు గ్రంథములు వీరికి కీర్తిప్రతిష్టలను తెచ్చిపెట్టింది. పింగళి సూరనార్యుని 'కళాపూర్ణోదయము' ముద్రణదోషములతోను, విరుద్ధపాఠభేదములతోను నుండి యర్ధావగతికి గష్ట పెట్టుచున్నదని వీరు పరిశ్రమించి, పాఠభేదములు గుర్తించి సరిచేసి భావప్రకాశిక యను టీకతో, ఆమహాకావ్యమును లెస్సయగు తీరులోనికి గొనితెచ్చిరి. ఇది ముద్రింపించినవారు పీఠికాపురాధీశ్వరులు. వీరు ఆంధ్రవిశ్వకళా పరిషత్తు సెనేట్, అకడమిక్కు కౌన్సిలు, ఓరియంటల్ ఫాకల్టీ మొదలగువానిలో సభ్యుడై పండితులకు సంస్కృతాంధ్రములకు సంబంధించిన తీర్మానములు తెచ్చెడివారు. 1927 సం.లో వీరి అధ్యక్షతన ప్రారంభమైన "ఉపాధ్యాయ పండిత పరిషత్తు" నేడు తెలుగునేలలో నలుమూలల ప్రాకి ప్రభుత్వము వారిచే గొన్ని ఉపయోగములు చేయించుకొన్నది. 'ఆంధ్ర భాషానుశాసనము' అనుపేరుగల వీరి వ్యాకరణగ్రంథమునకు గొప్పప్రతిష్ట వచ్చినది.




ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

1 వ్యాఖ్యలు:

వర ప్రసాద్ said...

తిరుపతి వేంకట కవులలో ఒకరి జన్మస్థలం మహా పవిత్రం. అచటనే పుట్టిన వీటినుండి ఇన్ని గొప్ప గ్రంధాలు రావటం, మీద్వారా మాకు చదివే భాగ్యం కలగటం సంతోషం.

Post a Comment

అనుసరించువారు