ఆంధ్ర ప్రబంధము- అవతరణ వికాసములు
Andhra Prabandham-Avatarana Vikasamulu
కాకర్ల వేంకట రామ నరసింహం .Kakarla Ramanarasimham
ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి వెలువడిన మొట్టమొదటి పరిశోధనా గ్రంథమిది. అప్పట్లో రామ నరసింహంగారిని "డాక్టరుగారూ" అని అభిమానంగా పిలిచేవారట.
ప్రబంధం అనేది తెలుగువారి సొత్తు.ఈ ప్రక్రియ ప్రారంభించడం వల్లనే రాయలు పెద్దన్నను ఆంధ్ర కవితా పితామహా అన్నారు. సంస్కృత శ్రవ్యకావ్య,దృశ్యకావ్య లక్షణాలను రెంటినీ ఒక్కదగ్గర చేర్చిన ప్రక్రియ ప్రబంధం. అటువంటి ప్రబంధం యొక్క పుట్టుక, పెరుగుదల మొదలైన సకల విషయాలూ ఇందులో చదివి తెలుసుకోవచ్చు.