ఆంధ్రపత్రిక - స్వర్ణోత్సవ సంచిక
Andhra Patrika Svarnotsava Sanchika
దాదా హయాత్ గారు తెలిపారు .......
వేమూరి విశ్వనాథ శర్మ గారు, ఎం.ఏ., ఎల్.టి., యెవరో మనకు తెలీదు. నాకూ తెలీదు. వారు 1925 నాటికి నలభై వుత్తరాలు సేకరించారు. అవి అప్పటికే నూటయాభైసంవత్సరాలనాటివి. తంజావూరు రాజ్య వాస్తవ్యులకు సంబంధించిన తెలుగు వుత్తరాలు. ఇప్పుడు తమిళం ప్రధాన భాషగా వున్న తంజావూరు ప్రాంతంలో ఒకప్పుడు తెలుగేప్రధానభాషగా అందరూ వాడేవారని నిరూపించడానికి వాటిలో మచ్చుకు కొన్ని వుత్తరాలు వారు 'ఆంధ్రపత్రిక ' 1925 క్రోధన సంవత్సరాది సంచికలో 'దక్షిణాది తెలుగు; కొన్ని పాత వుత్తరాలు ' అనే పేరుగల వ్యాసంలో ప్రకటించారు.