ఆర్కైవ్ లో (DLL వారివి) కొన్ని నవలలు కన్పించినాయి. వాటిని అందుబాటులోకి తెస్తే ఔత్సాహికులైన పాఠకులకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ సాధ్యమైనవాటిని అందిస్తున్నాము.
తెలుగులో వెలువడిన వివిధ ప్రక్రియలపై గతంలో ప్రపంచమహాసభల వేళలో అప్పటి ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు చిన్న చిన్న పుస్తకాలు వెలువరించారు. అటువంటివి పరిశోధకులకు, పరీక్షార్థులకు ఉపయోగకరమని, అంతర్జాలంలో లభించినవాటిని ఒక్కదగ్గర సంగ్రహిస్తున్నాము.
తెలుగులో చతుర్విధ కవిత్వాల్లో చిత్రకవిత్వం ఒకటి. ఇది నన్నె చోడుని కాలంనుండే తెలుగులో ఉన్నా, సంస్కృతంనుండి మనకు వచ్చిందని చెప్పడానికి సందేహం లేదు. ఎందరో కవులు చిత్రకవిత్వంలో పరిశ్రమ చేసారు
జాతక కథలు భారతదేశంలో ప్రాచుర్యం పొందిన బుద్ధుని పూర్వ జన్మల గురించిన జానపద కథల సమాహారం. క్రీ.పూ 300 — క్రీ.శ 400 మధ్యలో రచించబడినట్టుగా చెప్పబడుతున్న ఈ కథలన్నీ పాళీ భాషలో లభ్యమయ్యాయి. తరువాత అనేక భాషల్లోకి తర్జుమా చేయబడ్డాయి. వీటి సంఖ్య సుమారుగా 550-600 మధ్యలో ఉంటుంది.
ప్రముఖ భాషాశాస్త్ర పండితులు, ఆచార్య రవ్వా శ్రీహరి గారు తమ Ph.D. పట్టంకొరకు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సమర్పించిన సిద్ధాంతగ్రంథం అంతర్జాలంలో లభించింది.