31 జనవరి, 2016

తెలుగు సాహిత్య కోశము Telugu Sahitya Koshamu


నల్లపాటి శివనారయ్యగారు సంపాదించిన (ప్రాచీన) తెలుగు సాహిత్య కోశము మీకు అందిస్తున్నాము.

27 జనవరి, 2016

రావూరి భరద్వాజ రచనలు Ravuri Bharadwaja Rachanalu

ఇంతకు ముందు జ్ఞానపీఠ పురస్కారాన్ని రావూరి భరద్వాజగారు పొందిన సందర్భంగా అభినందిస్తూ ప్రకటించిన టపాలో కొన్ని వారి రచనలను పేర్కొనడం జరిగింది. ఇప్పుడు మాకు అంతర్జాలంలో లభించిన పుస్తకాలననన్నిటిని ఒక్క దగ్గర చేర్చి ప్రకటిస్తున్నాము.

25 జనవరి, 2016

కావ్యాలంకార సంగ్రహము (నరసభూపాలీయము) kavyalamkara sangrahamu (Narasa bhupaliyam)

కావ్యాలంకార సంగ్రహము (నరసభూపాలీయము) 
 kavyalamkara sangrahamu (Narasa bhupaliyam)
రామరాజభూషణుడు Ramaraja Bhushana

తెలుగులో వెలువడిన అలంకారశాస్త్ర గ్రంథమిది.

24 జనవరి, 2016

పురాణ నామ చంద్రిక Purana Nama Chandrika

పూర్వగాధాలహరి ప్రసిద్ధమైన పూర్వ కథా గ్రంథం. అందులో మన పురాణాల్లోని వివిధ పాత్రలు,స్థలాలు మొదలైన వాని పేర్లు, వాని విశేషాలూ ఉంటాయి. అటువంటివే ఈ పురాణ నామ చంద్రిక, పురాణ నామ సంగ్రహము.

Purana Nama Chandrika

20 జనవరి, 2016

ఆరుద్ర రచనలు Writings of Arudra

ఆరుద్ర ( ఆగస్టు 311925 - జూన్ 41998) పూర్తిపేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి . శ్రీశ్రీ తర్వాత యువతరంపై ఎక్కువ ముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు. ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగు రచయిత్రి.



19 జనవరి, 2016

సురవరం ప్రతాపరెడ్డి రచనలు Suravaram Prathapa Reddy Rachanalu

సురవరం ప్రతాపరెడ్డి 1896 మే 28 న మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడు లో జన్మించాడు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఏ, తిరువాన్‌కూరులో బి.ఎల్ చదివాడు. కొంతకాలం పాటు న్యాయవాద వృత్తి నిర్వహించాడు. అనేక భాషలు అభ్యసించాడు. మంచిపండితుడు1926 లో ఆయన నెలకొల్పిన గోలకొండ పత్రిక తెలంగాణ సాంస్కృతిక గమనంలో మైలురాయి. గోలకొండ పత్రికసంపాదకీయాలు నిజాం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించాయి. నిజాం ఆగ్రహించి సంపాదకీయాలు సమాచార శాఖ అనుమతితోనే ప్రచురించాలని నిబంధన పెట్టాడు. దాన్ని తిప్పికొడుతూ ప్రతాప రెడ్డి ప్రపంచ మేధావుల సూక్తులను సేకరించి సంపాదకీయానికి బదులుగా ప్రచురించాడు.

18 జనవరి, 2016

ఆంధ్రుల సాంఘిక చరిత్ర Andhrula Sanghika Charitra

ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథాన్ని ప్రముఖ సంపాదకుడు, చరిత్ర కారుడు, రచయిత సురవరం ప్రతాపరెడ్డి సుమారు 20 సంవత్సరాల పాటు చేసిన పరిశోధన చేసి రచించాడు. రెండు వేలయేళ్ళుగా వివిధ సాహిత్య ఆకరాలను ఆధారం చేసుకుని కొంతవరకూ పురావస్తువులతో సరిచూసుకుని రచించిన సాంఘిక చరిత్ర ఇది. రాజుల చరిత్ర కాక ప్రజల చరిత్రకు ఇది ప్రాధాన్యం ఇస్తుంది.
Andhrula Sanghika charitra
by
Suravaram Pratapa Reddy

17 జనవరి, 2016

గోల్కొండ కవుల సంచిక Golkonda Kavula Sanchika

తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి (మే 281896 - ఆగస్టు 251953). పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, ప్రేరకుడుగా, క్రియాశీల ఉద్యమకారుడుగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి అనన్యమైనవి. స్థానిక చరిత్రల గురించి, స్థానిక ప్రజల కడగండ్ల గురించి ఆయన పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం. తెలంగాణలో కవులే లేరనే నిందావ్యాఖ్యలను సవాలుగా తీసుకొని 354 కవులతో కూడిన "గోల్కొండ కవుల సంచిక" గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో సహా ప్రచురించి గ్రంథరూపంలోనే సమాధానమిచ్చిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి ఒక అధ్యాయం. 

అనుసరించువారు