07 February, 2016

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం ( మందరము) Mandaramu Vavikolanu Subba Rao

వావికొలను సుబ్బారావుగారు రచించిన మందరము తెలుగువారికి నిజంగా రామాయణ విషయ విశేష మందారమే. దీనికి వారు శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం అనే పేరు పెట్టినా మందరము గానే ప్రసిద్ధమిది. శ్రీ భక్తి సంజీవని వారు అందించే ప్రయత్నం చేసారు. సాయి రియల్ ఆటిట్యూడ్ వారు కూడా ఆ ప్రయత్నమే చేసారు. ఇప్పటికీ ఇంకా మనం దిగుమతి చేసుకోకుంటే ఎలా? చదువకుంటే ఎలా?


06 February, 2016

పోతన చరిత్రము(వానమామలై వరదాచార్యులు) Potana Charitramu (Vanamamalai Varada acharyulu)

వానమామలై వరదాచార్యులు గారు రచించిన పోతన చరిత్రము అనే అద్భుత గ్రంథాన్ని మీకు అందించే భాగ్యాన్ని తెలుగు పరిశోధన పొందింది.


31 January, 2016

తెలుగు సాహిత్య కోశము Telugu Sahitya Koshamu


నల్లపాటి శివనారయ్యగారు సంపాదించిన (ప్రాచీన) తెలుగు సాహిత్య కోశము మీకు అందిస్తున్నాము.

27 January, 2016

రావూరి భరద్వాజ రచనలు Ravuri Bharadwaja Rachanalu

ఇంతకు ముందు జ్ఞానపీఠ పురస్కారాన్ని రావూరి భరద్వాజగారు పొందిన సందర్భంగా అభినందిస్తూ ప్రకటించిన టపాలో కొన్ని వారి రచనలను పేర్కొనడం జరిగింది. ఇప్పుడు మాకు అంతర్జాలంలో లభించిన పుస్తకాలననన్నిటిని ఒక్క దగ్గర చేర్చి ప్రకటిస్తున్నాము.

25 January, 2016

కావ్యాలంకార సంగ్రహము (నరసభూపాలీయము) kavyalamkara sangrahamu (Narasa bhupaliyam)

కావ్యాలంకార సంగ్రహము (నరసభూపాలీయము) 
 kavyalamkara sangrahamu (Narasa bhupaliyam)
రామరాజభూషణుడు Ramaraja Bhushana

తెలుగులో వెలువడిన అలంకారశాస్త్ర గ్రంథమిది.

24 January, 2016

పురాణ నామ చంద్రిక Purana Nama Chandrika

పూర్వగాధాలహరి ప్రసిద్ధమైన పూర్వ కథా గ్రంథం. అందులో మన పురాణాల్లోని వివిధ పాత్రలు,స్థలాలు మొదలైన వాని పేర్లు, వాని విశేషాలూ ఉంటాయి. అటువంటివే ఈ పురాణ నామ చంద్రిక, పురాణ నామ సంగ్రహము.

Purana Nama Chandrika

20 January, 2016

ఆరుద్ర రచనలు Writings of Arudra

ఆరుద్ర ( ఆగస్టు 311925 - జూన్ 41998) పూర్తిపేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి . శ్రీశ్రీ తర్వాత యువతరంపై ఎక్కువ ముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు. ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగు రచయిత్రి.



19 January, 2016

సురవరం ప్రతాపరెడ్డి రచనలు Suravaram Prathapa Reddy Rachanalu

సురవరం ప్రతాపరెడ్డి 1896 మే 28 న మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడు లో జన్మించాడు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఏ, తిరువాన్‌కూరులో బి.ఎల్ చదివాడు. కొంతకాలం పాటు న్యాయవాద వృత్తి నిర్వహించాడు. అనేక భాషలు అభ్యసించాడు. మంచిపండితుడు1926 లో ఆయన నెలకొల్పిన గోలకొండ పత్రిక తెలంగాణ సాంస్కృతిక గమనంలో మైలురాయి. గోలకొండ పత్రికసంపాదకీయాలు నిజాం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించాయి. నిజాం ఆగ్రహించి సంపాదకీయాలు సమాచార శాఖ అనుమతితోనే ప్రచురించాలని నిబంధన పెట్టాడు. దాన్ని తిప్పికొడుతూ ప్రతాప రెడ్డి ప్రపంచ మేధావుల సూక్తులను సేకరించి సంపాదకీయానికి బదులుగా ప్రచురించాడు.

అనుసరించువారు