ఇంతకు ముందు జ్ఞానపీఠ పురస్కారాన్ని రావూరి భరద్వాజగారు పొందిన సందర్భంగా అభినందిస్తూ ప్రకటించిన టపాలో కొన్ని వారి రచనలను పేర్కొనడం జరిగింది. ఇప్పుడు మాకు అంతర్జాలంలో లభించిన పుస్తకాలననన్నిటిని ఒక్క దగ్గర చేర్చి ప్రకటిస్తున్నాము.
ఇటీవల నవీకరించిన టపాలు
27 January, 2016
25 January, 2016
కావ్యాలంకార సంగ్రహము (నరసభూపాలీయము) kavyalamkara sangrahamu (Narasa bhupaliyam)
లేబుళ్లు:
Literary Criticism
24 January, 2016
పురాణ నామ చంద్రిక Purana Nama Chandrika
లేబుళ్లు:
Dictionary,
Kavya-Prabandham,
Puranam,
Sanskrit Refference
20 January, 2016
19 January, 2016
సురవరం ప్రతాపరెడ్డి రచనలు Suravaram Prathapa Reddy Rachanalu
సురవరం ప్రతాపరెడ్డి 1896 మే 28 న మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడు లో జన్మించాడు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఏ, తిరువాన్కూరులో బి.ఎల్ చదివాడు. కొంతకాలం పాటు న్యాయవాద వృత్తి నిర్వహించాడు. అనేక భాషలు అభ్యసించాడు. మంచిపండితుడు. 1926 లో ఆయన నెలకొల్పిన గోలకొండ పత్రిక తెలంగాణ సాంస్కృతిక గమనంలో మైలురాయి. గోలకొండ పత్రికసంపాదకీయాలు నిజాం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించాయి. నిజాం ఆగ్రహించి సంపాదకీయాలు సమాచార శాఖ అనుమతితోనే ప్రచురించాలని నిబంధన పెట్టాడు. దాన్ని తిప్పికొడుతూ ప్రతాప రెడ్డి ప్రపంచ మేధావుల సూక్తులను సేకరించి సంపాదకీయానికి బదులుగా ప్రచురించాడు.
18 January, 2016
ఆంధ్రుల సాంఘిక చరిత్ర Andhrula Sanghika Charitra
ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథాన్ని ప్రముఖ సంపాదకుడు, చరిత్ర కారుడు, రచయిత సురవరం ప్రతాపరెడ్డి సుమారు 20 సంవత్సరాల పాటు చేసిన పరిశోధన చేసి రచించాడు. రెండు వేలయేళ్ళుగా వివిధ సాహిత్య ఆకరాలను ఆధారం చేసుకుని కొంతవరకూ పురావస్తువులతో సరిచూసుకుని రచించిన సాంఘిక చరిత్ర ఇది. రాజుల చరిత్ర కాక ప్రజల చరిత్రకు ఇది ప్రాధాన్యం ఇస్తుంది.
Andhrula Sanghika charitra
by
Suravaram Pratapa Reddy
లేబుళ్లు:
Research in History
17 January, 2016
గోల్కొండ కవుల సంచిక Golkonda Kavula Sanchika
తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి (మే 28, 1896 - ఆగస్టు 25, 1953). పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, ప్రేరకుడుగా, క్రియాశీల ఉద్యమకారుడుగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి అనన్యమైనవి. స్థానిక చరిత్రల గురించి, స్థానిక ప్రజల కడగండ్ల గురించి ఆయన పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం. తెలంగాణలో కవులే లేరనే నిందావ్యాఖ్యలను సవాలుగా తీసుకొని 354 కవులతో కూడిన "గోల్కొండ కవుల సంచిక" గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో సహా ప్రచురించి గ్రంథరూపంలోనే సమాధానమిచ్చిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి ఒక అధ్యాయం.
లేబుళ్లు:
Telangana
16 January, 2016
సాక్షి వ్యాస సంపుటి-పానుగంటి Sakshi by Panuganti
సాక్షి వ్యాసాలు పానుగంటి లక్ష్మీ నరసింహారావు (1865-1940) రచించిన ప్రసిద్ధ తెలుగు వ్యాసాల సంపుటి. ఈ వ్యాసములన్ని కూడ చిక్కనైన గ్రాంధిక భాషలో వ్రాయబడినాయి.
లేబుళ్లు:
Essay,
Modern Literature,
Sakshi
Subscribe to:
Posts (Atom)