తెలుగు సాహిత్యంలో గురజాడది ప్రత్యేకస్థానం. ఆయన ఆధునిక కవిత్వానికి యుగకర్త. వ్యావహారిక భాషను రచనల్లో వాడి, దానికీ పుస్తకభాషా స్థాయిని కల్పించిన మహనీయుడు.
తెలుగులో వెలువడిన జానపదగేయ వాఙ్మయాన్ని మథించి, అందులో ప్రస్తావించిన గాథలు, ఆచారాలు, సంస్కృతి మొదలైనవానిగురించి సమగ్రంగా పరిశోధించి అందించారు ఆచార్య నాయని కృష్ణకుమారిగారు.
ఆచార్య బిరుదరాజు రామరాజు గారు పరిశోధించి, వ్రాసిన సిద్ధాంతగ్రంథం ఈ తెలుగు జానపద గేయ సాహిత్యము. ఇది ఉస్మానియా విశ్వైద్యాలయం తెలుగు విభాగంలో సమర్పించబడిన మొదటి పరిశోధనాగ్రంథం. అంతే కాకుండా జానపదగేయ సాహిత్యంలో వెలువడిన మొదటి పరిశోధనాగ్రంథం. ఇది తరువాత వెలువడిన ఎన్నో పరిశోధనాగ్రంథాలకు ఆకరం.
చిలకమర్తి లక్ష్మీనరసింహం రచనలు Chilakamarthi Lakshmi Narasiamham Rachanalu
కవిగా, నవలా రచయితగా, నాటక రచయితగా, సంఘసంస్కర్తగా పేరుపొందిన చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు చేసిన అనేక రచనల్లో అంతర్జాలంలో లభిస్తున్న వాటిని సేకరించి, మీ ముందుకు తెస్తున్నాం. ఈ పుస్తకాలను దిగుఅమతి చేసుకుని, చదివి, ఆనందించండి.