ప్రముఖ భాషాశాస్త్ర పండితులు, ఆచార్య రవ్వా శ్రీహరి గారు తమ Ph.D. పట్టంకొరకు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సమర్పించిన సిద్ధాంతగ్రంథం అంతర్జాలంలో లభించింది.
తెలుగు సాహిత్యంలో గురజాడది ప్రత్యేకస్థానం. ఆయన ఆధునిక కవిత్వానికి యుగకర్త. వ్యావహారిక భాషను రచనల్లో వాడి, దానికీ పుస్తకభాషా స్థాయిని కల్పించిన మహనీయుడు.
తెలుగులో వెలువడిన జానపదగేయ వాఙ్మయాన్ని మథించి, అందులో ప్రస్తావించిన గాథలు, ఆచారాలు, సంస్కృతి మొదలైనవానిగురించి సమగ్రంగా పరిశోధించి అందించారు ఆచార్య నాయని కృష్ణకుమారిగారు.